అధిక బరువు.. ప్రస్తుత కాలంలో అధికంగా వింటున్న సమస్య ఇది. అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని కూడా తినకుండా ఎక్సర్సైజులు , డైటింగ్ , జిమ్, వర్కౌట్స్ అంటూ రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అలసిపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక సింపుల్ డ్రింక్ తాగితే తప్పకుండా బరువు తగ్గి పోవచ్చు. అదేమిటంటే తేనె.. సాధారణంగా తేనె తో చాలామంది నిమ్మరసం, వేడి నీళ్లు కలుపుకొని తాగుతూ బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక మంచి చిట్కా అయినప్పటికీ దీంతో పాటు మరి కొన్ని ద్రవాలు జోడించి తాగడం వల్ల త్వరగా అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

తేనెలో యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్,  విటమిన్ బి 6, విటమిన్ బి1 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి తరచూ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక ఉబ్బసం,  కఫం , అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే తేనెను ప్రతి రోజు వేడి పాలలో కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.. ఒత్తిడి తగ్గిపోవడం, నాడీ వ్యవస్థ మెరుగుపడటం, నాడీ కణాల సమస్యలు దూరమవడం , సుఖనిద్ర, జీర్ణక్రియ మెరుగుపడటంతో, మలబద్ధకం సమస్య దూరమవడం, అధిక బరువు నుంచి విముక్తి, ఎముకల పటిష్టత, శారీరక మానసిక సమస్యలను దూరం చేసి మంచి రోగనిరోధక శక్తిని అందించే గొప్ప ఔషధం అని వైద్యులు చెబుతున్నారు.


ఇక తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగినా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లెమన్ టీ తాగే వాళ్ళు కూడా అందులో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే శరీరానికి ఎనర్జీ లభించడంతో పాటు మంచి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒక తేనె , నిమ్మరసం, వేడి నీటిలో కలుపుకొని తాగడం వల్ల రోజంతా హాయిగా ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. జీలకర్ర నీళ్లు, తేనె  కూడా మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తేనెతో కలిపి ఇలాంటి డ్రింక్స్  ఒకసారి ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: