ఉల్లి పాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత మనకు తెలిసిందే. పేదవాడి కూర ఉల్లిచారు. దీనినే పచ్చిపులుసు అని కూడా అంటారు. ఆ చారుకు చలువ చేసే గుణం వుంది. ఉల్లిపాయను తరుచు వాడటం వలన వీర్యము వృద్ధి అవుతుంది. ఉల్లిపాయను తరుచూ తీసుకోవడం వలన రక్తము శుద్ధి అవుతుంది. శ్వాస క్రియ కు ఇబ్బంది కలిగించే ఆయాసము, జలుబు వంటి ఊపిరి తిత్తుల వ్యాధుల నుండి రక్షిస్తుంది. ముక్కు బెదిరిన పుడు (ముక్కు నుండి రక్త స్రావం కలుగుతున్నప్పుడు) ఉల్లిపాయ ను నలిపి వాసన పీల్చాలి. ఇలా పీల్చుతుంటే రక్తస్రావం అరికట్ట బడుతుంది. ఉల్లిపాయ ను తరిగేటప్పుడు కళ్ళ వెంట నీరు రావడం సహజం. ఇలా నీళ్ళు రావడం వలన కళ్ళు శుభ్రపడతాయి. గోంగూర పచ్చడి కలిగించే వేడిని ఉల్లి పాయను తినడం వలన వేడి తగ్గుతుంది. 

కడుపులో బల్ల పెరిగినా, కడుపుకు నీరు పట్టి బాగా ఉబ్బుతూ ఉంటే నీరుల్లిపాయను ఉడక బెట్టి ప్రతిపూట నాలుగేసి తింటుంటే వీటి నుండి బయటపడే అవకాశము ఉంటుంది. కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్నవారు, నీరు ఉల్లి పాయలను పొయ్యిలో వేసి కాల్చి మెత్తగా నూరి ఆ పదార్థం తో మందంగా పట్టు వేస్తే నొప్పులు తగ్గుతాయి. శరీరంలో తిమ్మెరలు అధికంగా వున్నపుడు రోజుకు మూడు సార్లు పచ్చి నీరుల్లిపాయను బాగ నూరి ఆ గుజ్జు తో మర్దన చేయడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరిగి తిమ్మెరలు తగ్గిపోతాయి. తేలు కుట్టినప్పుడు ఉల్లిపాయ గుజ్జును రుద్దితే ఉపశమనంగా వుంటుంది. నరాల నిస్సత్తువ పోవాలంటే రోజుకో నీరుల్లి పాయ ను మజ్జిగ తో తింటే సరిపోతుంది. ఈ చిట్కాలు పాటిస్తే.. ఎలాంటి డాక్టర్‌ వైద్యం మనకు అవసరమే లేదు.  కాబట్టి పైన చెప్పిన ఆరోగ్య సూచనలు అందరూ పాటించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: