ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారు.అలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. కారణం.. అధిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి ఇంకా అలాగే ఎక్కువగా ఆలోచించడం తదితర కారణాల వల్ల మానవుడు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.ఇక ప్రపంచంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అనే తేడా లేకుండా చాలా మందిని డయాబెటిస్‌ (Diabetes) వ్యాధి వెంటాడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో ఈజీగా నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ (Onion) ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది. పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఉల్లిగడ్డని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి ఇంకా హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.



ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.కాగా, ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో ఎలాంటి మంట తగ్గిపోతుందట. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు అనేవి తగ్గి పోయి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి ఇంకా అలాగే స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: