అధిక రక్తపోటు సమస్య అనేది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతోంది. కేవలం అధికరక్తపోటు వల్లే మరణిస్తున్న సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ దేశంలో హైబీపీకి సంబంధించి కొత్త నివేదికను రిలీజ్ చేశారు.ఇక అందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 'ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ రిపోర్టు' పేరుతో రిలీజ్ అయిన నివేదికలో అధికరక్తపోటుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యతనివ్వాలని నివేదించింది. పరిస్థితి కూడా ప్రమాదకర స్థాయిలోనే ఉందని దేశంలో ఉన్న పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ సమస్య ఉన్నట్టు రిపోర్టు ద్వారా బయటపెట్టింది.ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI) అనేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ఇంకా అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియా బ్రాంచ్ కలిసి నిర్వహించిన ప్రాజెక్టు. 2017 వ సంవత్సరంలో పెరిగిన రక్తపోటు కేసులను తగ్గించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.



మొదటగా పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ ఇంకా అలాగే మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వేలను నిర్వహించారు. అక్టోబర్ 2021 నాటికి 19 రాష్ట్రాల్లోని 100కు పైగా జిల్లాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించడం జరిగింది.ఇండియాలోని పెద్దల్లో చాలా ఎక్కువ శాతం మందిలో హైబీపీ సమస్య ఉన్నట్టు పాత నివేదికలు ఎప్పుడో చెప్పాయి. నియంత్రణలో ఉంచుకునేట్టు చేయడం ఇంకా అలాగే హైబీపీ రోగుల సంఖ్య తగ్గేలా చైతన్యం పెంచేందకు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అలాగే ఈ ప్రాజెక్టులో హైపర్ టెన్షన్ కేసుల్లో నాలుగు రెట్లు ఎక్కువ నియంత్రణ పెరిగినట్టు గుర్తించారు.ఇంకా హైబీపీ నియంత్రణంలో ఉంచుకుంటున్న రోగుల సంఖ్య పెరగుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు.ఇక గతంలో పోలిస్తే హైబీపీ నియంత్రణలో ఉంచుకుంటున్న వారి సంఖ్య బాగా పెరగుతున్నప్పటికీ... హైబీపీ సమస్య బారిన పడిన రోగుల సంఖ్య కూడా అధికంగానే ఉన్నట్టు గుర్తించింది ఈ సర్వే.అలాగే భారతదేశ జనాభాలో పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరు హైబీపీ రోగులుగా ఉన్నట్టు బయటపడింది. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: