శరీరంలోని అతి వేడి కారణంగా మనకు ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి చాలా ఎక్కువ అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం ఇంకా అలాగే అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు.అయితే.. ఇక దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా ఇంకా అలాగే నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని చాలా సులభంగా మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను ఇంకా కొద్దిగా పటిక బెల్లం వేసి ఒక రెండు నుండి మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి. జీలకర్ర ఇంకా పటిక బెల్లంలు మన శరీర వేడిని తగ్గించడానికి చాలా బాగా దోహదపడుతాయి. ఇలా నానబెట్టిన జీలకర్ర ఇంకా అలాగే పటిక బెల్లం కలిపిన నీటిని తాగడం వలన శరీరంలోని వేడిని ఈజీగా తగ్గిస్తుంది. ఇలా మీరు రోజులో ఒక రెండు సార్లు తాగితే ఇక వెంటనే మీ శరీరంలో వేడి అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇదే.. మీరు మరో విధంగా కూడా దాన్ని తీసుకోవచ్చు.



జీలకర్ర ఇంకా అలాగే పటిక బెల్లంలు సమానంగా తీసుకొని మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఒక డబ్బాలో నిలువ చేసుకోని.. రోజు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్‌ పొడిని వేసి కలిపి తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు కనుక తాగితే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో కూడా మంట వంటివి అసలు ఇబ్బంది పెట్టవు. అలాగే దీంతో పాటు.. మజ్జికలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగినా కూడా శరీరంలో అతి వేడిని తగ్గించుకోవచ్చు. ఇక ఇదికాకపోయినా.. ఒక మూడు నాలుగు టీ స్పూన్‌ సబ్జా గింజలను తీసుకొని వాటిని ఒక నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసులోకి తీసుకొని మరి కొన్ని నీటిని కలుపుకొని ఇంకా అందులో ఒక అర చెక్క నిమ్మరసాన్ని బాగా పిండాలి. ఇలా తయారుచేసిన పానీయం తీసుకోవడం వలన శరీరంలోని వేడి అనేది వెంటనే తగ్గిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసి శరీరంలోని వేడిని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా ఖచ్చితంగా ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. ఒంట్లో వేడిని ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: