మన భారతీయ సంస్కృతిలో నేలపై కూర్చొని ఆహారం తినడం చాలా ఉత్తమంగా చెబుతారు. ఈ విషయం అనేక గ్రంథాలలో కూడా చెప్పారు. దీని వెనుక లోతైన శాస్త్రం కూడా దాగి ఉంది.ఇక నేలపై కూర్చొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి మనం తెలుసుకుందాం.నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఊబకాయం అనేది పెరగదు.నేలపై కూర్చొని తినడం వల్ల మన శరీరం అనేది చాలా నిటారుగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ఈజీగా చేరుతుంది. అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దృష్టి అంతా కూడా ఆహారంపైనే ఉంటుంది. అందువల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు అదుపులో ఉండి ఊబకాయ సమస్య అనేది రాదు.అలాగే శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.



ఇక నేలపై కూర్చున్నప్పుడు మన శరీరంలోని రక్తనాళాలు చాలా సక్రమంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం ఈ గొట్టాల ద్వారా మీ తల నుంచి కాలి దాకా చాలా సులభంగా ప్రసరిస్తుంది. మంచం లేదా కుర్చీపై కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇది అసలు జరగదు.అలాగే కుటుంబంలో సామరస్యం ఇంకా ఐక్యత నెలకొంటాయి. ఇక నేలపై కూర్చొని భోజనం చేస్తే కుటుంబంలో ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. దీంతోపాటు ఆహారం కూడా వృథా కాదు. తినే ఆహారం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది పాత తరం నుంచి తరువాతి తరానికి అందిస్తున్న చక్కటి సంస్కృతి.



ఎసిడిటీ ఇంకా గ్యాస్‌ని దూరం చేస్తుంది.ఇక నేలపై కూర్చొని భోజనం చేయడం శరీరంలోని జీర్ణవ్యవస్థకు మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ ఇంకా అలాగే గ్యాస్ ఏర్పడే సమస్య ఉండదు. దీంతో పాటు ఎముకల బలహీనత ఇంకా అలాగే కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు రోజూ ఉదయం ఇంకా అలాగే సాయంత్రం నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటే మీ మోకాళ్లకు వ్యాయామం జరుగుతుంది. ఇక అవి మీ శరీర బరువును ఎక్కువసేపు భరించగలవు.అలాగే ఆహారం కూడా చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇక మీరు ముందుకు వంగి ఆహారం తీసుకొని ఆపై నిటారుగా ఉన్న భంగిమలో రావాలి. ఇలా చేయడం ద్వారా మీరు తిన్న ఆహారం అలిమెంటరీ కెనాల్ ద్వారా నేరుగా మీ జీర్ణవ్యవస్థకు చేరుతుంది. దీని వల్ల కడుపునొప్పి ఇంకా అలాగే అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడతారు.దీనివల్ల వెన్నెముక కూడా చాలా ఫిట్‌గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: