ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఇందులో 39 శాతం వరకు సోడియం, అలాగే 61 శాతం క్లోరిన్ లు కలిపి ఉంటాయి. ఇక మన శరీర బరువులో ఉప్పు 0.5 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ మనిషి ఎప్పుడైతే 10 రోజుల పాటు ఉప్పును తినకుండా మానేస్తాడో అప్పుడు కణాలలో ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా ద్రవాల సమతుల్యం ఏర్పడి నీరు కణాల్లోకి చేరుతుంది. దీని కారణంగా శరీరం అంతా ఉబ్బి పోతుంది. ఇదే కనుక మరి కాసేపు కొనసాగితే కణాలు పగిలి ప్రాణాపాయం సంభవిస్తుంది. ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానేయడం వలన శరీరం లో ఏ క్రియ కూడా సక్రమంగా జరగదు అందుకనే ఉప్పును సమ పాళ్ళలోనే తీసుకోవాలి.
ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉండి డాక్టర్లు ఉప్పు తక్కువ తీసుకోవాలి అని సూచిస్తే మాత్రం కొంచం తక్కువ మోతాదులో తీసుకోవాలి.. ముఖ్యంగా అధిక రక్త పీడనంతో బాధ పడేవారు మాత్రం ఉప్పును మీరు తీసుకునే ఆహారంలో కొంచెం మాత్రమే వాడాలి. అసలే తగ్గించినా నష్టమే... ఎక్కువైనా ప్రమాదమే. కొన్ని సార్లు ఇలా తీసుకోవడం ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మీ ఆరోగ్యం తగినట్లు ఉప్పును వాడుకోండి.