సాధారణంగా చాలా మందికి కూడా రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అనేది ఎక్కువ అలవాటుగా ఉంటుంది.. కానీ 63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు మాత్రం ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు లైట్స్ వేసుకుంటారు..కానీ తాజా నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే వారు అధిక శాతం ఊబకాయం ఇంకా అలాగే అధిక రక్తపోటు వంటి సమస్యలను కలిగి ఉన్నారట.ఇక రాత్రి సమయంలో ఎటువంటి కాంతికి గురికానీ వారికంటే లైట్స్ వేసుకునే వారిలో ఎక్కువగా ఆ సమస్యలు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుుతన్నాయి.జూన్ 22 వ తేదీన ఓ పత్రికలో ప్రచురించబడిన నివేదికలో రాత్రిపూట లైట్స్ వేసుకుని పడుకునేవారిలో ఊబకాయం ఇంకా అధిక రక్తపోటు సమస్యలు అధికంగా ఉంటుందని వెలువడింది..ఇక స్మార్ట్ ఫోన్ లేదా రాత్రిళ్లు టీవీ లైట్స్ వంటి కాంతిలో 24 గంటలు ఉంటున్నామని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫీన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇంకా నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ ఫిజిషియన్ అధ్యయన సంబంధిత రచయిత డా.మింజీ కిమ్ అన్నారు.


వృద్ధులలో ఇప్పటికే మధుమేహం ఇంకా అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని.. కాబట్టి వారు ఖచ్చితంగా రాత్రిళ్లు ఎక్కువగా కాంతికి గురయినప్పుడు అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయన్నారు.. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో మొత్తం 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటలు పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు తెలిపారు.ఊబకాయం, మధుమేహం ఇంకా అలాగే అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు లైట్స్ వేసుకుని నిద్రపోవడానికి చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరు చీకటిలో కంటే కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండడడం అందుకు ప్రధాన కారణం.. మధుమేహం సమస్య కారణంగా పాదాల తిమ్మిరి ఉన్నవారు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట కాంతిని ఉంచుకోవాలనుకోవచ్చు. వీరు రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేయడం మరింత ముఖ్యం అన్నారు ఆరోగ్య నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి: