మధుమేహం అనేది రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మధుమేహ బాధితులు చాలా ఎక్కువ అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు లైఫ్‌స్టైల్‌ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అయితే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా వారు దూరంగా ఉండాల్సిందే.ఇంకా అలాగే సరైన నిద్ర, శారీరక శ్రమతో పాటు ముందులు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచవచ్చు. కాగా మధుమేహం చికిత్సలో ఆయుర్వేదం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వంటగదిలో లభించే పలు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. మనం చేయాల్సిందల్లా వాటిని సరైన సమయంలో, సరైన మార్గంలో తీసుకోవడమే. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మెంతులు..రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఊబకాయం, కొలెస్ట్రాల్‌ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తాయి.దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అలాగే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో అదనపు కొవ్వులను కరిగించడంలో కూడా సమర్థంగా పనిచేస్తుంది.అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడుతాయి. అలాగే రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. అయితే డాక్టర్ సలహా మేరకు అల్లంను మితంగా తీసుకోవాలి.బ్లాక్ పెప్పర్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.ఎన్ని రకాల భయంకర వ్యాధులు వున్నా కానీ షుగర్ వ్యాధి మాత్రం చాలా మందిని వణికిస్తుంది. ఎందుకంటే మిగతా వ్యాధులుకైనా మందులు వున్నాయేమో కానీ షుగర్ వ్యాధులకు మాత్రం నయం చేసే మందులు అసలు లేవు. కేవలం కంట్రోల్ చేసే మందులు మాత్రమే వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: