మన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లేకపోతే అది శరీరంలోని ఇతర అవయవాలకి హాని చేస్తుంది. అందుకే షుగర్ పేషెంట్స్ తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 అయితే రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 చాలా తక్కువ మందికి వస్తుంది. కొందరికి పుట్టక నుంచే ఇన్సులిన్ లోపం ఏర్పడి టైప్-1 డయాబెటిస్ వస్తుంది. కానీ, అత్యధిక మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. ఇది సాధారణంగా వయసుతో పాటు అభివృద్ధి చెందుతుంది. గతంలో మధుమేహం అనేది వంశపారపర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మారుతున్న జీవనశైలి కారణంగా వయసు తేడా లేకుండా వస్తోంది. దీని వల్ల శరీరంలోని ఇన్సులిన్ పరిమాణం తగ్గిపోతుంది. ఇది చివరికి అధిక చక్కెర స్థాయిలకి దారి తీస్తుంది.వైద్యుని సలహా ప్రకారం మందులు తీసుకుంటూ షుగర్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఔషధాల మార్గం ద్వారానే కాకుండా ఆహారపదార్థాలతో కూడా చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుకోవచ్చు.ఇక ఈ ఆహారాలు మీ డైట్లో భాగం చేసుకుంటే సరిపోతుంది.పెరుగులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. పెరుగును అల్పాహారంగా తీసుకోవచ్చు. ప్రొబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టిరియా. ఇది పొట్ట, పేగుల ఆరోగ్యానికి మంచి చేస్తుంది. క్యాల్షియం, మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటాయి.


దాల్చిన చెక్క అనేది కూరలకి రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ మసాలాలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెరని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, గుండె సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.బాదంపప్పు, వాల్ నట్స్, పిస్తా, అంజీరా, కిస్ మిస్, ఎండు ఖర్జూరం, జీడిపప్పు వంటివి నట్స్ జాబితాలోకి వస్తాయి. వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. వాటిలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటి ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా వాటిని నానబెట్టుకుని తినాలి. అప్పుడే పూర్తిస్థాయిలో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: