నిల్వ ఉంచిన ఆహారం తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా.. దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో ధృఢంగా ఉండేవారు. నేటి ఆధునిక కాలంలో ఒక కూరను రెండు రోజులకు వండేసుకోవడం. లేదా రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్లో పెట్టడం చాలామంది చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మళ్లీ వేడి చేసి తింటున్నారు. అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను చేస్తుంది. సాధారణంగా వండిన ఆహారాన్ని వంట చేసిన కొన్ని గంటల్లోనే తినాలని.. మరుసుటిరోజుకు మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


నిల్వ ఉన్న ఆహార పదార్థాలలో ఎటువంటి శక్తి ఉండదని, అందుకే అవి వ్యక్తుల్ని మరింత నీరసంగా, సోమరిపోతులుగా చేస్తాయని చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువు ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. తాజా ఆహారం మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.కొంతమంది కొన్ని ఆహారపదార్థాలను రెండు, మూడు రోజులకు సరిపడా తయారుచేసుకుని వాటిని నిల్వచేసుకుని.. తినే ముందు వేడిచేసుకుని తింటుంటాం. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయుర్వేద వైద్య పద్ధతుల ప్రకారం వండిన ఆహారాన్ని 3 గంటలలోపు లేదా గరిష్టంగా అదే రోజున తినాలి. మనం తయారుచేసుకున్న ఆహారాన్ని గాలి కూడా చేరని డబ్బాల్లో ఎంత నిల్వ ఉంచినా.. మరుసటి రోజుకు అది తాజాగా ఉండదు. కచ్చితంగా పాడైపోతుంది. ఫ్రిజ్లోపెట్టి నిల్వచేసినా.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: