పుదీనా ఆకుల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.ఇంకా అలాగే ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. ఇక కొంతమంది పుదీనా ఆకులతో చట్నీ ఇంకా రైస్ కూడా చేస్తుంటారు. అయితే పుదీనాను మాత్రం నేరుగా తీసుకోలేం..అయితే పుదీనాతో చేసే టీని తాగవచ్చు. దీన్ని రోజుకు రెండు కప్పుల మోతాదులో తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఒక 5 నుంచి 6 పుదీన ఆకులను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడగాలి. కప్పున్నర నీళ్లను ఒక పాత్రలో పోసి అందులో పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. స్టవ్‌ను చిన్న మంటపై ఉంచి 10 నిమిషాల పాటు మరిగించాక అనంతరం ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇందులో రుచికోసం అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసంని కలుపుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పుదీనా ఆకుల టీని రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగాలి. దీంతో ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.


ఈ టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అలాగే అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంకా అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చలికాలంలో మన జీర్ణశక్తి తగ్గుతుంది. మలబద్దకం వస్తుంది. కానీ పుదీనా ఆకుల టీని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే ఈ టీని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబుతోపాటు ఆస్తమా కూడా వస్తుంది. కానీ పుదీనా ఆకులతో చేసే టీని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే పుదీనా ఆకుల టీని తాగడం వల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: