ఈ రోజుల్లో చాలా మందిని కూడా థైరాయిడ్  సమస్య ఎంతగానో వేధిస్తుంది.అయితే ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో ధనియాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. నీళ్లు బాగా వేడి చేసి అవి మరిగిన తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచికి కొరకు అర టీ స్పూన్ తేనెను ఇంకా ధనియాలు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న ధనియాల కషాయన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. ఇక థైరాయిడ్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో అవిసె గింజలు ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో అవిసె గింజలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.


ఇక థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇక ఈ పొడిని గాజు సీసాలో వేసి ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్  తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి.ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఒకవేళ ఇలా నీటిని తాగలేని వారు ఒక టీ స్పూన్  అవిసె గింజల పొడిని తిని ఆ తరువాత నీటిని తాగాలి.ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది.ఇంకా అలాగే థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడే వారు క్యాలీప్లవర్, క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటి కూరగాయలను తక్కువగా తీసుకోవాలి. ఇంకా అలాగే పాల పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఆహారంలో బి విటమిన్స్ ఇంకా అలాగే ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: