ఇక ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి వేడి చేయాలి. సోంపు గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇంకా అలాగే శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో సోంపు గింజలు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అలాగే నిద్రలేమిని సమస్యను తగ్గించడంలో, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.ఇక కీళ్ల నొప్పులను తగ్గించడంలో, చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. సోంపు గింజలను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఇలా సోంపు గింజలను వేసిన తరువాత ఇందులో ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అల్లం అనేది మన శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇంకా అలాగే మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో, తలనొప్పిని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది.


ఆ తరువాత ఈ పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. అలాగే దాల్చిన చెక్కలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇంకా రక్త ప్రసరణను వేగవంతం చేయడంలో దాల్చిన చెక్క మనకు ఎంతో సహాయపడుతుంది. ఇక ఇలా మరిగించిన పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇవి గోరు వెచ్చగా అయిన తరువాత వీటిలో తేనెను కానీ, లేదా పటిక బెల్లాన్ని కానీ కలుపుకుని వాటిని తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ఉదయం పూట లేదా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తాగాలి. ఈ విధంగా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, అలసట ఇంకా అలాగే బలహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు తగ్గి చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: