బొప్పాయి పండు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా కొన్ని రకాల రోగాలు నయం చేయడంలో చాలా ఉపయోగకారి. బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకపదార్థాలు ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చిన వారి శరీరంలో ప్లేట్లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే.
ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది, కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. బొప్పాయి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
- బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండడం వలన శరీరంలో కి ప్రవేశించి క్యాన్సర్ కు కారకమయ్యే హానికర క్రిములను తొలగించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
- బొప్పాయి పండుని తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుముఖం పడుతుంద.
- భోజనం తిన్నాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది తినడం వల్ల మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
- ఈ జ్యూస్ తాగడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి, ట్రాన్సిల్స్ వ్యాధి తగ్గుముఖం పడుతాయి.
- బొప్పాయి తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యలను తీరుస్తుంది.
- ఈ బొప్పాయి పండులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ఈ బొప్పాయి గుజ్జును బ్యూటీ క్రీముల్లో ఎక్కువగా వాడుతారు.
- బొప్పాయి పాలను ఒక టీస్పూన్ మోతాదులో నిత్యం తాగుతుంటే దాంతో లివర్ శుభ్ర పడుతుంది. పెరిగిన ప్లీహం, లివర్ మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.