క్యాన్సర్ నివారణ ముఖ్యంగా మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. జీర్ణకోశ క్యాన్సర్లన్నీ మనం తీసుకునే ఆహారంతో ముడిపడినవే కావటం గమనార్హం. క్యాన్సర్ కారక పదార్థాలు కణాల్లో మార్పులకు దారితీయొచ్చు. ప్రస్తుతం మన ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు, ఇంటి తిండి తినటం తగ్గిపోయింది.
బయటి తిండి తినటం బాగా పెరిగిపోయింది. సుమారు 35% మంది ప్రతివారం ఒకట్రెండు సార్లయినా బయటి తిండి తింటున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది.
వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే , మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఒక పరిశోధనలో తేలింది.
1, చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఏను ధ్వంసం చేయడం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుందని అధ్యయనాలు అంచనా.
2, అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే అయినా నూనె అధికంగా ఉండే సాల్మన్, మాకరెల్ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయట. వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు బాగాగ తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది.
3, ఈ విషయం పై యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి.
4, తరచూ చేపలను తినేవారిలో క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని, ఆరోగ్యకర ఆహారంలో చేపలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని డాక్టర్ మార్క్ గుంటర్ అన్నారు.
5, ప్రజలు పొగతాగడం మాని బరువును తగ్గించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కేసులను 40 శాతం వరకూ నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.