విష జ్వరాలతో హైదరాబాద్ నగర వాసులు  భయాందోళనలు చెందుతున్నారు. హైదరాబాద్ మొత్తంలో జనవరి 1నుంచి సెప్టెంబర్ 8వరకూ 3వేల 670కేసులు ఉన్నాయని గుర్తించినా అధికారికంగా ఎటువంటి రికార్డులు నమోదుకాలేదు. కేవలం పది రోజుల వ్యవధిలోనే డెంగ్యూ  వ్యాధి కారణంగా నలుగురు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా కుత్బుల్లాపూర్‌కు చెందిన  ప్రవీణ్ కుమార్ బెకూ. అంతేకాకుండా 13ఏళ్ల జాన్ విన్‌స్టన్, 5ఏళ్ల కె.రుత్విక మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స్ తీసుకుంటూ మరణించారు.



తీవ్రమైన జ్వరంతో బాధపటున్న ప్రవీణ్  సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతని పరిస్థితి అదుపుకాలేదు. రోజులు గడుతున్నఅతనికి జ్వరం నియంత్రించలేకపోయారు వైద్యులు. సాధారణంగా  డెంగ్యూ బాధితుల్లో నోరు, ముక్కులో నుంచి రక్తం, పల్స్ పడిపోవడం, శ్వాస అందుకోలేకపోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి సమస్యలతోనే ప్రవీణ్ ప్రాణాలతో పోరాటం చేశాడు. ఈ విషయంలో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.  



అవయవాలు ఫెయిలవడంతో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అతని అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిలవడం మొదలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్లేట్ లెట్ కౌంట్ పూర్తిగా పడిపోయి 20వేల కంటే తక్కువ స్థాయికి చేరింది. డెంగ్యూ అని తెలిసినప్పటి నుంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నా మంగళవారం ఉదయం 6గంటల 10నిమిషాలకు ప్రాణాలు కాపాడలేకపోయాం' అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: