ఇప్పుడు ప్రజలందర్ని వణికిస్తున్న వ్యాధి డెంగీ.ఈ డెంగీ జ్వరంతో పట్నాలు,పల్లెలు బెంబేలెత్తి పోతున్నాయి.ఇప్పటికే నగరంలో డెంగీ బారిన పడి చాలా మంది వరకు మృతి చెందారు.ఇక డెంగీ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ప్లేట్‌లెట్స్.ఈ వ్యాధి సంక్రమిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ గణనీయంగా తగ్గిపోతాయి.అందుకోసం బొప్పాయి పండు గాని,వాటి ఆకుల రసం గాని సేవిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరుగుతాయని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఈ వార్తను కొందరు ప్రజలు విపరీతంగా నమ్ముతుండగా,మరికొందరు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో కొందరు  డాక్టర్లు ఈ వార్తపై ఏమంటున్నారో తెలుసుకుందాం.డెంగీ జ్వరంలో అసలు సమస్య ప్లేట్‌లెట్స్ తగ్గటం కాదని డాక్టర్లు అంటున్నారు.రక్త నాళాల్లోంచి ప్లాస్మా ద్రవం లీకై రక్తం చిక్కపడటం అనేది డెంగీ వలన కలిగే అసలు సమస్య అని,బొప్పాయి ఆకు రసంలో ఉన్న రసాయనాలు కొంతమేరకు ప్లేట్‌లెట్స్‌ను పెంచుతున్నట్టు కొన్ని పరిశోధనల్లో వెల్లడైనా అవి డెంగీ చికిత్సకు సరిపడేంత స్థాయిలో లేవన్నది గుర్తించాలంటున్నారు.



అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం బొప్పాయి ఆకుల రసాన్ని డెంగీ వ్యాధి కోసం సిఫారసు చేయటం లేదంటున్నారు.బొప్పాయి పండ్లు,కివీ,జామపండ్లు, కలబంద రసం వంటివీ డెంగీ తగ్గటానికి ఉపయోగపడవని డాక్టర్ల వాదన. వీటిపై ఆధారపడి చికిత్స తీసుకోకపోవటం సరికాదంటున్నారు.ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా భయపడాల్సిన అవసరం లేదని, కాని స్వంత వైద్యం పై ఆధారపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే మేలుజరుగుతుందని సూచిస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: