ఈ కాలంలో చాలామంది అనారోగ్యంపాలైన తర్వాత ఆరోగ్యం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ అనారోగ్యంపాలు కాకముంది పాటించాల్సినవి మాత్రం పాటించడం లేదు. ఎందుకు అంటే సమయం ఉండటం లేదు. అంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రజలు. ఇంకా చాలామంది అయితే ఉదయం 9 దాటాక ఇంటి బయటకు వస్తారు.. సరిగ్గా అర్ధగంటలో కార్, బస్సు లో ప్రయాణించి మళ్ళి నీడా పాటున ఉంటున్నారు. 


అసలు ఎండపొడ తగలకుండానే రోజు గడిపేస్తున్నారు. దీనివల్ల ఎండా ద్వారా శరీరానికి అందే విలువైన విటమిన్ డి ని కోల్పోతున్నారు. ఇలా ఏళ్ళు గడిచే కొద్దీ శరీరంలో విటమిన్‌ డి లోపించి పలు అనారోగ్యాల పాలవుతారు. శాఖాహారుల్లో ఈ విటమిన్ డి లోపం ఇంకా ఎక్కువ ఉంటుంది. విటమిన్‌ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు మరింత ఎక్కువని పలు అధ్యయనాల్లో రుజువైంది. 


మన దేశంలో 90 శాతం మందికి విటమిన్‌ డి లోపం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిఒక్కరికి విటమిన్ డి అందలి. విటమిన్ డి లోపిస్తే శరీరంలో వచ్చే లోపాలను, మార్పులను, లక్షణాలను ఇక్కడ చదివి తెలుసుకోండి.   


శరీరానికి తగినంత విటమిన్‌ డి అందితేనే కాల్షియాన్ని ఇస్తుంది.  లేకుంటే విటమిన్‌ డి లోపం తలెత్తితే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడి ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. అధిక బరువున్న వారిలో ఈ మార్పు మరింత వేగంగా కనిపిస్తుంది.


విటమిన్ లోపం ఉన్నవారిలో కండరాలూ, కీళ్ల నొప్పులూ దీర్ఘకాలం బాధిస్తాయి.


కొందరు ఎన్ని నియమాలు పాటించినా, విశ్రాంతి తీసుకున్నా అలసటా, ఒత్తిడీ బాధిస్తాయి. అలాగే క్షణక్షణానికీ మనఃస్థితి, భావోద్వేగాలు మారిపోతాయి. తరచూ ఈ సమస్య కనిపిస్తుంటే అది విటమిన్ డి లోపం ఉందని అనుమానించాలి.


వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, దురదగా, చిరాగ్గా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఉన్నట్టు అనుమానించాలి .


విటమిన్ డి నివారణ... 


రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో కనీసం అరగంట ఎండ తగిలేలా చూసుకోవాలి.


రోజూ పాలూ, దానిమ్మ, నారింజ, చేపలూ, బాదం, ఆకుకూరలూ.. అధిక మోతాదులో తీసుకుంటే ఈ లోపం పూర్తిగా నయమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: