"ప్రజలు పేదరికం గురించి చాలా మాట్లాడుకుంటారు. ఎప్పుడూ పెద్ద, పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతారు. ఉదాహరణకు, పేదరికానికి ప్రధాన కారణం ఏంటి? విదేశీ నిధులతో పేదరికాన్ని తొలగించలేరా? ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్ర ఎలా ఉండాలి? అంటారు. ఇలాంటి పెద్ద చర్చల్లో పేదరికం చిక్కుకుపోతుంది. ఇక్కడ మనం ఆ పేదరికాన్ని పరిష్కరించే అంశాలను ముక్కలుగా విడగొట్టాలి" అని అభిజిత్ బెనర్జీ చెప్పారు.

అంటే దానర్థం... విద్య, ఆహారం, టీకాలు వేయడం లాంటి పనులపై దృష్టి పెట్టాలి. పేదలకు కాస్త సాయం అందిస్తే ఇలాంటి కార్యక్రమాల సక్సెస్ రేట్ పెరుగుతుంది నోబెల్ కమిటీ వెబ్‌సైట్‌లో ఒక గ్రాఫిక్ ప్రచురించారు. అందులో ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 'పప్పు' లాంటి ఒక మామూలు వస్తువును ప్రోత్సాహకంగా ఉపయోగించి, టీకాలు వేసే ఒక ప్రాజెక్టును ఎలా విజయవంతం చేయగలిగారో చూపించారు.

"పూర్తిగా టీకాలు  వేయించని చిన్న పిల్లల సంఖ్య రాజస్థాన్‌లో చాలా తక్కువగా ఉంది. . ఇమ్యూనైజ్డ్ పిల్లల సంఖ్య 5 శాతానికి దగ్గరగా ఉన్నట్టు తేలింది. ఇమ్యునైజేషన్ సిబ్బంది ప్రజల వరకూ చేరుకోలేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిసింది" అని ఎస్తేర్ డఫ్లో చెప్పారుదాంతో ప్రజలే చాలాదూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ నడిచివెళ్లేవారు. టీకాలు వేయించడానికి వారికి రోజంతా గడిచిపోయేది. అంటే దానర్థం, . .వాళ్లు చాలాసార్లు టీకాలు వేయించుకోకుండానే తిరిగి వెళ్లిపోయేవారు. కారణం, ఒక్కోసారి టీకాలు అయిపోతే, మరోసారి సిబ్బంది వెళ్లిపోయేవారు. లేదంటే అక్కడ పెద్ద పెద్ద క్యూలు కనిపించేవి. దాంతో పిల్లలకు టీకాలు వేయించాలనే విషయాన్ని వారు పక్కన పెట్టేశారు.అలాంటి పరిస్థితుల్లో, ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు ఒక ప్రయోగం చేయాలని భావించారు. దానికి సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు. టీకాలు వేయించే స్థాయిని పెంచాలనుకున్నారు. దానికోసం వాళ్లు లాటరీ ద్వారా 120 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించారు

మొదటి కేటగిరీలో ఉన్న గ్రామాల్లో ఉన్న పేదలకు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోమని చెప్పారు.
రెండో కేటగిరీ గ్రామాల్లో టీకాలు వేసే మొబైల్ క్లినిక్స్ ప్రజల ఇళ్ల దగ్గరికే వెళ్లేలా ప్లాన్ చేశారు.
మూడో కేటగిరీ గ్రామాల్లో టీకాలు వేసే మొబైల్ క్లినిక్‌లు ప్రజల దగ్గరికే వచ్చాయి. దానితోపాటు టీకా వేయించుకున్న వారికి ప్రోత్సాహకంగా ఒక కిలో పప్పు కూడా ఇచ్చేవారు.
ఈ ప్రయోగం ఫలితాన్ని మీరు గ్రాఫిక్‌లో స్పష్టంగా చూడచ్చు. ఏయే గ్రామాల్లో పప్పును టీకాలకు ప్రోత్సాహకంగా ఇచ్చారో, అక్కడ పూర్తిగా ఇమ్యునైజ్ అయిన పిల్లల సంఖ్య 39 శాతానికి చేరుకుంది. పప్పు ఇవ్వని గ్రామాల్లో అది సగానికంటే తక్కువగా .కనిపించింది  నుండి ఇలా పేదలకు చిన్న చిన్న ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం పేదరిక నిర్మూలనకు అద్భుతంగా పనిచేస్తాయని ఆర్థిక వేత్తలు చెప్పారు. ఇది ప్రజల అవసరాలు, సమస్యలను అర్థం చేసుకుని ఆర్థికవేత్తలు చేసిన అద్భుతం. 'పప్పు' లాంటి ఒక మామూలు వస్తువుతో వీరు పేదరిక నిర్మూలన దిశగా చాలా పెద్ద వ్యత్యాసం తీసుకొచ్చారు.
..                                  . 
.


మరింత సమాచారం తెలుసుకోండి: