మనిషి జీవితం ఎలా మారిందంటే వివిధరకాల పని ఒత్తిడిలు, ఎన్నోరకాలైన ఉద్యోగాలు, నిత్యం సోషల్మీడియాతో పాటుగా, ఇతర యాప్లతో కుస్తీపట్టడంతోపాటు ఉద్యోగ, వ్యాపారాలు, చదువులు వివిధ రకాల పనుల్లో క్షణం తీరిక లేనంతగా బిజీగా ఉంటున్నాడు.. ఇలాంటి జీవితాన్ని గడిపే భాగ్యనగర వాసుల్లో ఇటీవల కాలంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని నిపుణులు గుర్తించారు .
మనుషుల్లో మానసిక రుగ్మతలు పెరుగుతుండటం, రోగనిరోధక శక్తి తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఈ విషయాలు కాస్మోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్స్ నిపుణుల తాజా అధ్యయనంలో తేలిందట.. అయితే ..ఈ సమస్యను ఎక్కువగా 18-45 ఏళ్ల మధ్యనున్నవారే ఎదుర్కొంటున్నారని, ఈ వయస్సు వారే అధికంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ వయో గ్రూపులో ఉన్న వారిలో ఈ లక్షణాలు అత్యధికంగా గమనించినట్లు సైన్స్ నిపుణులు తెలిపారు.
ఇకపోతే చాలామంది తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగితేలుతూ..తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం లేదని తెలుస్తోంది. వీటి నుండి బయట పడటానికి రోజులో కొద్దిసేపు యోగా, ధ్యానం, నడక వంటి ఆరోగ్యకర వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే మానసిక ఒత్తిడిమాయం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే.. సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదని హెచ్చరించారు. రోజు వారి చర్యలో మానసిక విశ్రాంతికి తగిన ప్రాధాన్యతనివ్వటం, కళ్లకు, సరిపడగా నిద్రించడం, మనం తీసుకునే ఆహారంలో శరీరానికి తగినన్ని పోషకాలు అందేలా చర్య తీసుకోవటం తప్పనిసరి అని తెలిపారు.