ఇటీవల కాలంలో గుండెసమస్యలతో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. గుండెసమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ గుండెసమస్యలకు ఈజీగా చెప్పే ఔషదం మన వంటింట్లోనే ఉంది. మీరు విన్నది నిజమే. వంటింట్లో దొరికే దివ్యౌషధాల్లో ధనియాలు. వీటిని వంటకి రుచి పెంచడానికి ఉపయోగిస్తుంటారు. కానీ, వీటిని వాడడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ధనియాలతో తయారు చేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగండి.
ధనియాల కషాయం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. దీని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దూరమవుతాయి. అలాగే ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటకు పంపుతుంది. ఈ కషాయం ఆడవారిలో రుతుసమస్యలని కూడా దూరం చేస్తుంది. ఇక ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే మీకు షుగర్ అనేదే రాదు.
టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధనియాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు ధనియాలు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. ఆయా సమస్యల నుంచి బయట పడాలంటే ధనియాల కషాయం తాగాలి. అంతేకాకుండా..ధనియాలను రోజూ తీసుకుంటే బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మరింత మంచిది.