చైనా నుండి వచ్చిన కొత్త వైరస్ ను దూరంగా ఉంచాలనే ఆశతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రక్షిత ఫేస్ మాస్క్లను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వాటిని కొనుగోలు చేస్తున్నాయి. దక్షిణ కొరియాలోని పాఠశాలలు శీతాకాలపు సెలవుల నుండి తిరిగి వచ్చేటప్పుడు పిల్లల బ్యాగ్ లలో మాస్క్ లు మరియు హ్యాండ్ శానిటైజర్ లు అమర్చమని తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. కానీ మాస్క్ లు మనల్ని వైరస్ నుండి కాపాడుతాయా? ఇది వివిధ సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది.
అన్ని వైరస్ లు ఒక సాధారణ పట్టీ-ఆన్ మెడికల్ మాస్క్ ద్వారా వెళ్ళడానికి సరిపోతాయి, కాని సూక్ష్మక్రిములు సాధారణంగా ఒక సమయంలో గాలిలో వ్యాపించవు అని నాష్విల్లెలోని వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ మార్క్ డెనిసన్ చెప్పారు. డెనిసన్ సార్స్ మరియు మేర్స్ వైరస్ ల పై అధ్యయనం చేసారు , ఇవి కరోనా వైరస్ లు. తుమ్ము లేదా దగ్గు ద్వారా బిందువులు గా వైరస్ లు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి చేరుతాయి. ఆ బిందువులు చేతులు మరియు ఇతర శరీర భాగాల పైకి చేరుతాయి, ఈ శరీర భాగాలను ఇతరులు తాకినప్పుడు వైరస్ వారికీ సంక్రమిస్తుంది, మరియు వారు తమ కళ్ళు, ముక్కు లేదా నోటిని ఆ చేతులతో తాకడం ద్వారా ఆ వైరస్ వారికీ చేరుతుంది. మాస్క్ లు తుమ్ము లేదా దగ్గు నుండి పెద్ద బిందువులను నిరోధించగలవు. అంటే వాటికి కొంత విలువ ఉందని డెనిసన్ చెప్పారు. అలాగే, మాస్క్ ధరించి ఉన్న ఎవరైనా తమ ముక్కు మరియు నోటిని తాకలేరు. మాస్క్ ను ధరించి ఉన్న ఎవరైనా ఉపరితలం పై మిగిలి ఉన్న సూక్ష్మక్రిములను తమకు చేరకుండా అవి కాపాడుతాయి అని ఆయన అన్నారు. మాస్క్ లు చాలా సున్నితమైన ముందు జాగ్రత్త అని అయితే శాస్త్రవేత్తలు కొత్త వైరస్ ఎలా సంక్రమిస్తుందో అధ్యయనం చేయడానికి కృషి చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ట్రూడీ లాంగ్ చెప్పారు. అయితే వీటిలో ఏదీ కఠినమైన పరిశోధనల మీద ఆధారపడి లేదు. మాస్క్ వేసుకున్న వ్యక్తి కి వైరస్ సోకాదని, వేసుకొని వ్యక్తికీ సోకుతుందని కచ్చితంగా ఎవరు చెప్పలేరు.