రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగిస్తూ నే ఉంది ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. మనం వాడే మాస్కులు కరోనా నుండి ఏ మాత్రం కాపాడలేవు దీనికి ప్రత్యామ్నాయం n-95 మాస్కులు మాత్రమే. వీటిని కొనాలంటే అధిక ధర వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ ప్రజానీకానికి ఈ మాస్కులు కొనడం చాలా కష్టం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజ-( ఐ ఐ టి) ఢిల్లీ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ బిపిన్ కుమార్ కవచా మాస్క్ లను n95 ముసుగు లకు సరి అయిన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేశారు.
కవచా మాస్కూల్లో 98% కరోనా నీ నియంత్రించే సామర్థ్యం ఉంటుందని ప్రొఫెసర్ చెబుతున్నారు దీనిలో త్రీ మైక్రాన్ పార్టికల్ సైజ్ ఫిల్టర్లను పొందుపరిచారు. దీని ధర కేవలం 45 రూపాయలు మాత్రమే. ఈ మాస్క్ లను ఆన్లైన్లో కూడా పొందవచ్చు. ఈ మాస్క్ లను ఉతికి లేదా కడిగి కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇలా పది సార్లు ఉపయోగించుకోవచ్చు. బిపిన్ కుమార్ ప్రకారం n95 ముసుగులు కంటే కవచా ముసుగులు చాలా ఉత్తమమైనవి అని చెబుతున్నాడు.