భారత్‌లో కరోనా జోరు క‌నిపిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది... గ‌డిచిన ప‌క్షం రోజుల్లోనే కేసుల సంఖ్య‌ రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన  హెల్త్ బులెటిన్లోని వివరాల‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 9,304 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కు చేరుకోగా.. మరణించినవారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఒకేరోజు 260 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనాబారిన పడి కోలుకుని ఇప్పటి వరకు దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,04,107 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. 


ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో మంగళవారం 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు వచ్చినవి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి.  అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. అయితే తాజాగా 21,203 కేసులు నమోదవ్వడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు  అమెరికాలో క‌రోనా కేసుల మొత్తం  సంఖ్య 18,80,526కి చేరాయి. అలాగే 1132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 108057కి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.


 ప్రస్తుతం బ్రెజిల్‌లో 5,56,668 కోవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం మరణాల సంఖ్య 31278కి చేరింది. రష్యాలో మొత్తం కేసులు 423741 ఉండగా.. మరణాల సంఖ్య 5037గా ఉంది. ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుతూ, పెరుగుతూ ఉంది. ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో 2ల‌క్ష‌ల క‌రోనా పాజిటివ్ కేసులు దాట‌గా ల‌క్ష‌న్న‌ర‌కు పైగా ఆక్టివ్ కేసులున్న‌ట్లు అధికారులు తెలిపారు. వైర‌స్ వ్యాప్తి ఇక‌పై అధికంగా ఉండే అవ‌కాశాలుండేట్లుగా ఉంద‌న్న అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే ఆరోగ్యాల‌ను కాపాడుకోగ‌ల‌మ‌ని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: