ముందుగా గుడ్డు పెంకులని తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి..గుడ్డు పెంకులను కేవలం బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే దానిపై ఉండే బ్యాక్టీరియా పోతుంది.మీకు ఎంత కాల్షియం అవసరమో.. అంతే తీసుకోండి. అవసరానికి మించిన కాల్షియం తీసుకుంటే..హైపర్కాల్సెమియా, కిడ్నీ డ్యామేజ్, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.గుడ్డు పెంకు పొడి వెనిగార్, నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్లో సులభంగా కరిగిపోతుంది.గుడ్డు పెంకు ఫౌడర్ను పిజ్జా, పాస్తా, మరేదైనా వంటకాల్లో వేసుకోవచ్చు. ఇది రుచిని ఏ మాత్రం మార్చదు.
గుడ్డు పెంకుల వల్ల ఎముకలు, దంతాలకు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. త్వరగా అలసిపోవడం, పనిలో చిరాకు, ఒత్తిడి లాంటి సమస్యలను కాల్షియం లేదా విటమిన్-డి లోపంగా భావించాలి. అలాంటివారు గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే తగిన కాల్షియం శరీరానికి లభిస్తుంది. అత్యధిక కాల్షియం పిల్లలు, వృద్ధులకే అవసరం అవుతుంది.గుడ్డుపెంకు మీద అనేక బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. కాబట్టి.. పెంకులను వేడి నీటిలో కనీసం 20 నుంచి 30 నిమిషాలు మరిగించి, పొడిగా చేసుకుని తీసుకోవాలి. పెంకులు పెంకులుగా తీసుకుంటే.. అంతర్గత అవయవాలకు హాని కలగవచ్చు. పొడి చేసిన గుడ్డు పెంకులను రోజుకు అర టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే చాలు. శరీరానికి కావల్సిన 90 శాతం కాల్షియం లభిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోండి...