ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కరోనా  వైరస్ ప్రభావం వల్ల చాలా మంది ఉద్యోగస్తులు వర్క్ ఫ్రొం హోమ్ కి బాగా అలవాటు పడ్డారు. కాని దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలుసా... కాబట్టి జాగ్రత్తగా ఉండండి... ఎక్కువ కూర్చొని పని చెయ్యడం వలన ఎన్ని అనర్ధాలో చూడండి....అకారణంగా బరువు తగ్గతారు ఇంకా  బాగా నీరసం వస్తుంది.అలాగే కూడా చూపు మందగిస్తుంది.ఇంకా పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి.శరీరంపై గాయాలు త్వరగా మానవు.అతిగా ఆకలి వేస్తుంది,కాళ్లలో స్పర్శ తగ్గుతుంది.కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగి మధుమేహం బారిన పడతారు.కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు.వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉంటుంది.శృంగార కోరికలు సన్నగిల్లుతాయి.చర్మం ముడత పడటం.

కాబట్టి వీటిబారిన పడకుండా ఈ పద్ధతులు పాటించండి..
వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నవారు.. ఒకే చోట కూర్చోకుండా.. అప్పుడప్పుడు అటూ ఇటూ తిరగండి. వ్యాయమం తప్పనిసరి. శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి.డయాబెటీస్ ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. శరీరానికి ఎంత కావాలో అంతే తినండి.సాధారణ శారీరక శ్రమ చేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 కెలోరీల ఆహారం తీసుకోవాలి.ఎక్కువ శారీరక శ్రమచేసేవాళ్లు 2,500 కెలోరీల ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తినకూడదు. డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రోటీని చేరుతుంది. దీని వల్ల కిడ్నీలు ఫెయిలవుతాయి. కనీసం 3 నెలలకు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి.ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో పైకి లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి. ఇలాంటి మరెన్నో  ఆరోగ్య కరమైన  విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: