నిమ్మరసంలో పసుపు కలపి ఓ డ్రింక్లా చేసుకుని తాగితే కచ్చితంగా అధికబరువును తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, పసుపు వేసి బాగా కలిపి వేడి తగ్గకముందే తాగాలి. ఈ డ్రింక్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగిపోతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్-సీ, ఫైబర్తోపాటు పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా శరీరం శక్తికోసం కొవ్వును వినియోగించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పసుపు కలిపిన డ్రింక్ తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీనివల్ల అనేక వైరస్లు, ఇన్ఫెక్షన్ల నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.
అంతేకాదు ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అలసట, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ డ్రింక్ మెరుగైన పనితనం చూపిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం నుంచి కూడా ఈ జ్యూస్ కాపాడుతుంది. కాబట్టి, అధిక బరువు ఉన్న వారే కాదు. అందరూ ఈ అద్భుతమైన డ్రింక్ను తీసుకోవచ్చు. అనేక ప్రయోజనాలను పొందచ్చు. ఇది మాత్రమే కాదు ఈ డ్రింక్ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కూడా రక్షణ పొందవచ్చట. క్యాన్సర్ కారకాలైన క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది.