ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు గ్యాస్ కూడా రేటు పెరుగుతుంది. సామాన్యులు గ్యాస్ కొనాలి అంటేనే భయపడుతున్నారు. రోజురోజుకు గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో మోడీ సర్కార్ కోటి మందికి ఫ్రీగా ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ స్కీమ్ ప్రారంభించారు. అయితే దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయనుందని సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి వివిధ దేశాల నేతల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కేంద్రం మరింత మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది.                                               


రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనుంది. అతి తక్కువ డాక్యుమెంట్లతో ఈ గ్యాస్ సిలిండర్లను పొందవచ్చని సమాచారం. 2021-2022 బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి ఫ్రీ గ్రాస్ సిలిండర్ల ప్రస్తావన తెచ్చారు.


 అయితే బడ్జెట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం రూపాయి కూడా కేటాయించక పోవడం గమనార్హం. తరుణ్ కపూర్ బడ్జెట్లో కేటాయించకపోవడం గురించి మాట్లాడుతూ సబ్సిడీ ద్వారా ఒక్కో కనెక్షన్ కోసం ఖర్చు అయ్యే1600 రూపాయల మొత్తాన్ని పూసుకోవచ్చా అని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాలు ఏకంగా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: