మతిమరుపు అనే సమస్య చాలా తీవ్రమైనది. మామూలుగా చిన్న చిన్న విషయాలపై మతిమరుపు ఉంటే పర్లేదు, కానీ ఏదైనా విలువైన,  ముఖ్యమైన విషయాలపై మతిమరుపు ఉంటే మాత్రం అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది..  మరీ ముఖ్యంగా మనం నిద్రపోయే సమయంలో, మన శరీరంలో ఎన్నో పనులు జరుగుతాయి. అంతేకాకుండా మనం నిద్ర పోయినప్పటికీ, మన మెదడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మనం నిద్ర పోయినప్పుడు మాత్రమే మన శరీరంలోని అన్ని కణాల రిపేర్ జరుగుతుంది.

అందులో భాగంగానే  బరువు పెరగడం, తగ్గడం, పొడవు పెరగడం లాంటివి కూడా నిద్రలోనే జరుగుతాయి. అందుకే తరచూ నిద్రలోంచి, ఉలిక్కిపడి  లేచే వారికి తరచూ మతిమరుపు బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ అని ఒక తాజా అధ్యయనం ద్వారా నిరూపించబడింది. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా తో బాధపడే వారికి, నిద్రపోయే సమయంలో తరచుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో మతిమరుపు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ.


ఇక వయసు పైబడిన కొద్దీ ఈ సమస్య ఎక్కువ అవుతుందని కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో కి చెందిన బృందం స్లీప్ ఆప్నియా, మెదడు పనితనం మధ్యనున్న సంబంధం గురించి అధ్యయనం నిర్వహించారు.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురైనట్లు ఆ బృందం వారు తెలిపారు. కాబట్టి స్లీప్ ఆప్నియా ఎంత తీవ్రంగా ఉంటే బాధితుల్లో మతిమరుపు,ఇతర సమస్యలు అంత ఎక్కువగా ఉంటాయని, ఇది నిద్రపోయే సమయం..ఎంత నాణ్యమైన నిద్ర అందుతోంది..వారు ఎంత తొందరగా నిద్ర లోకి జారుకుంటున్నారు.. వంటి అంశాలపై  ఆధారపడి ఉంటుంది.


అందుకే మతిమరుపు,ఇతర మెదడుకు సంబంధించిన సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికీ స్లీప్ ఆప్నియా కి సంబంధించిన పరీక్ష చేయాలని, ఒకవేళ ఇదే వారిలో మెదడు పనితీరుకు కారణమైతే అందుకోసం కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెజర్ ద్వారా వారి శ్వాసనాళాలు మూసుకుపోకుండా, తద్వారా వారికి మధ్యలో నిద్ర నుంచి మెలకువ రాకుండా సహాయపడే వీలుంటుంది.  కాబట్టి  స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడే వారు,  చికిత్స తరచూ  తీసుకునే వారు రెగ్యులర్ గా ఉపయోగించాల్సి ఉంటుంది అంటూ వివరించారు ఈ అధ్యయనకారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: