నిత్యం  మనం పాటించే అలవాట్లను దినచర్య అంటారు. దినచర్య అనేది మన జీవన విధానంలో ఎంతో ముఖ్యమైనది. అందులో మనకు తెలియకుండా చేసే తప్పుల వల్ల మనం అనారోగ్యం పాలయ్యే అవకాశముంటుంది. అయితే జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది శరీరానికి అవసరమైనంత నీరు తాగడం.

చాలామంది భోజనం సమయంలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిది కాదని చెబుతుంటారు. ఇది ఇంతవరకు నిజమో తెలుసుకోండి..భోజనం చేసేటప్పుడు చాలామంది నీరు తాగుతుంటారు. ఇది అంత మంచిది కాదని చెబుతారు. అయితే, తగిన మోతాదులో నీళ్లు తాగితే మంచిదే. అంతేకాని ఎక్కువ నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణక్రియ పనితీరు తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.                                            


కాబట్టి భోజనం సమయంలో ఎక్కువనీరు తీసుకోవద్దని చెబతారు. కాబట్టి భోజనం ముందు కానీ, తర్వాత అరగంట తేడాతో నీరు తాగాలి. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి.ఒంట్లో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడే ఇలా నీరు తాగాలనిపిస్తుంది. కాబట్టి భోజనం సమయంలోనే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండాలి. బోజనం సమయంలో మాత్రం తక్కువగా నీరు తాగాలి. ఇక భోజనం మరీ స్పైసీగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి.


ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసే సమయంలో నీటిని మధ్య మధ్యలో సిప్ చేస్తుండాలి. ఇది కడుపులో ఆహారం విచ్ఛిన్నం కావడానికి, సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయాలంటే ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: