ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి లో, వాతావరణంలో కలిగే మార్పులు కారణం కావచ్చు, మరేదైనా వ్యక్తిగత విషయం కావచ్చు.. చాలామంది సుఖ నిద్రను కోల్పోతున్నారు. సుఖంగా నిద్ర పోయి ఎన్నో రోజులు అయింది..అంటూ ఎవరో ఒకరు, రోజుకు ఒక్కసారైనా చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాము. అయితే ఏ కారణం చేత వారు నిద్రలేమితో బాధపడుతున్నారో తెలియక, సరికొత్త రోగాలను కూడా తెచ్చుకుంటారు. అయితే నిద్రలేమి సమస్యను దూరం చేసి ప్రశాంతమైన నిద్ర కావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి అంటున్నారు నిపుణులు. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం..



ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హై ప్రోటీన్ డైట్ అయినా నిద్రలేమికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రి సమయంలో అసలు తినకూడదట. ఇవి మీ నిద్రను దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు..


అయితే రాత్రిపూట సుఖనిద్ర కావాలి అంటే బాదంపప్పు, అరటి పండ్లు, తేనె,  ఓట్స్, గోరువెచ్చని పాలు ఈ ఐదు ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేసే మంచి ఆహారాలు అని పేర్కొంటున్నారు నిపుణులు. అంతే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే సాధ్యమైనంతవరకూ మీకు ఇష్టమైతే, ఒంటరిగా గడపడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా ఒంటరిగా గడపడం వల్ల మీరు గడిపిన ప్రతిక్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఏ విషయాన్ని మర్చిపోవాలో,ఏ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనే విషయం పైన మీకంటూ ఒక అవగాహన వస్తుంది.


అంతేకాకుండా వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పగటిపూట తిరగడం అలవాటు చేసుకోవాలి. పర్యావరణంలో కనీసం 30 నిమిషాల పాటు గడిపేలా, మీ సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు సాధ్యమైనంత వరకు ఆరుబయట స్వచ్ఛమైన గాలిని పీల్చి, పడుకునే లాగా ప్రయత్నించాలి. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల నిద్ర సుఖంగా వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: