తల నొప్పులు రకరకాలు ఉంటాయి. ముఖ్యంగా.. మన శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందుగా తల నొప్పి బయట పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎటువంటి తల నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకుడదు. మైగ్రేన్ తల నొప్పి, ఒంటి పార్శ్వపు నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం మీద 25 రకాలకు పైగా తల నొప్పలున్నాయట.
కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల తల నొప్పి రావడమో లేదా తల నొప్పి ఎక్కువవడమో జరగొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కొంతమందికి ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, చాక్లెట్స్, కెఫిన్, ఫ్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ వంటివి కొంత మందిలో తల నొప్పికి కారణమవుతుంటాయి.జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి పెయిన్ కిల్లర్స్గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి. ఇవి పెయిన్ కిల్లర్స్గా పనిచేస్తాయి.గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ అల్లం జ్యూస్ మిక్స్ చేసి తాగితే తల నొప్పి మటుమాయం అవుతుంది. గోరు వెచ్చని పాలలో అర చెంచా పసుపు కలుపుకుని తాగితే తల నొప్పి తగ్గుతుంది.మైగ్రేన్తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది. అల్లంలో కూడా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే లక్షణం ఉంది.చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వర్క్ ఎక్కువైనప్పుడు తల నొప్పి వస్తే రెండు చెర్రీస్ని నమిలితే మంచి రిజల్ట్ ఉంటుంది.కొన్ని సార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి.
అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.వీలైనంతగా మసాలా ఫుడ్ తగ్గించాలి. విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.వెల్లుల్లి మిశ్రమంలో రెండు బొట్లు నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, స్పినాక్ వంటివి తల నొప్పిని నివారిస్తాయి.ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్ పెట్టుకుంటే మంచిది.తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే స్నానం చేసిన తర్వాత కచ్చితంగా హెయిర్ డ్రైర్తో ఆరబెట్టుకోవాలి.కంప్యూటర్ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో వర్క్కి విరామం ఇవ్వాలి. స్క్రీన్ బ్రైట్నెస్ని తక్కువగా పెట్టుకోవాలి.కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి.