కరోనా సెకండ్ ప్రస్తుతం ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తుంది. ఏమాత్రం కనికరం లేకుండా విషపు నాగు అందరిని కాటేసి చంపేస్తుంది. ముఖ్యంగా భారత దేశంలో దీని తీవ్రత చాలా అంటే చాలా ఎక్కువగా వుంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు ఇటు వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఇక కరోనా నుంచి కోలుకోవాలంటే ఖచ్చితంగా మన శరీరంలో ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. రోగ నిరోధక శక్తి ఎంత మెరుగ్గా ఉంటే అంత మంచిది. అప్పుడే కరోనా వైరస్ ని జయించగలుగుతాము.ఇక రోగ నిరోధక శక్తి కోసం టాబ్లెట్స్, ఇంకా మందులు అవి వాడకుండా మనకు ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారిలో వైరస్ లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయట.


ఇక శరీరంలో రోగనిరోధక శక్తి వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ ప్రతి రోజు తప్పనిసరిగా తాగాలి.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. ముందుగా పొయ్యి వెలిగించి దానిపై గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తిప్పతీగ కాడలు చిన్నవి 5,ఒక తిప్పతీగ ఆకు,10 తులసి ఆకులు,4 మిరియాలు,చిటికెడు పసుపు,చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి.బాగా మరిగాక వడకట్టి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు తాగితే సరిపోతుంది. ఇలా తాగుతూ ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థ మెరుగవుతుంది.కాబట్టి ఆలస్యం చెయ్యకుండా మీరు ఆ డ్రింక్ ని తయారు చేసుకొని త్రాగండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.అలాగే బయటకి వెళ్ళేటప్పుడు మాస్కులు ఖచ్చితంగా ధరించండి. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే బయటకి వెళ్ళండి.సామాజిక దూరం పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: