ఎండాకాలంలో చెమటలు పట్టడం మామూలే కానీ దాని వల్ల వచ్చే సమస్యలు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. చెమట ఇంకా ఇతర కారణాల వల్ల వచ్చే మొటిమలు మరింతగా బాధిస్తాయి.ఇక అవి పెరిగితే, చర్మంలో దురద కూడా మొదలవుతుంది. కొన్నిసార్లు చర్మం చెమటను ఇంకా దానిపై పేరుకునే మురికిని పీల్చుకుంటుంది. ఈ మొటిమలు తెరిచిన రంధ్రాల్లాగా కూడా ఏర్పడతాయి. ఇక చెమట వల్ల వచ్చే మొటిమల వల్ల కూడా మీరు ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి.పసుపు, తేనె ఇంకా పాల వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు చర్మ నిపుణులు.



చెంచా పసుపు, తేనె ఇంకా పాలు కలిపి మంచి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై రాయాలి. కాస్తా ఆరాక నీటిని స్ప్రే చేసి మెల్లిగా రుద్దుతూ చల్లని నీటితో బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య చాలావరకూ తగ్గుతుంది.కలబంద, పసుపు ప్యాక్..కలబందలో ఎన్నో రకాల ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఎంజైమ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు మొటిమలు తయారయ్యేందుకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి సమస్యను బాగా అదుపు చేస్తుంది. ఇది పొడి చర్మం వారికి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు మాయిశ్చరైజర్‌తో కూడిన సన్‌స్క్రీన్‌ని కూడా ఉపయోగిస్తుంటే దానిని ఉపయోగించాల్సిన సరైన మార్గాన్ని నిపుణుల నుండి ఖచ్చితంగా తెలుసుకోండి.



అలాగే సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, నారింజ వంటివి కూడా చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టి మొటిమలను రాకుండా దూరం చేస్తాయి. ఈ ప్యాక్స్ వేసుకోవడం వల్ల ముఖం తాజాగా మారి చాలా అందంగా కనిపిస్తారు. అలాగే కీర దోస వల్ల కూడా మొటిమలను ఈజీగా తొలగించుకోవచ్చు. కీర దోసను తీసుకుని దానిపై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని ఫేస్ట్‌లా చేసుకుని అందులో బార్లీ పిండిని బాగా కలపాలి. ఈ రెండింటిని బాగా ముద్దలాగా చేసి ఎక్కడైతే మీకు మొటిమలు ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేయండి. అలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇక ఇలా మూడు నెలల పాటు వారానికి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం అనేది మీకు ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: