పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. వీటిని తినడం వల్ల చాలా రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.అందుకే వైద్యులు ఎక్కువగా పండ్లని తీసుకోమ్మని చెబుతారు.పిల్లలకైనా ఇంకా పెద్దవారైనా పండ్లు తినడం చాలా అవసరం. అయితే ఈ పండ్లను సమయం సందర్భాన్ని బట్టి తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లను రాత్రి పూట పడుకునే ముందు అస్సలు తినద్దొట.. అందులో ఖచ్చితంగా అరటి పండు(banana) ఒక్కటి. అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఈ పండును రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది కూడా వ్యాయామం తర్వాత లేదా సాయంత్రం పూట అరటి పండ్లను తింటుంటారు. కానీ ఈ పండును జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ సలాడ్‌గా అసలు రాత్రిపూట తీసుకోకూడదట. రాత్రిపూట అరటి పండ్లను తింటే మీ శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందట.



రోజూ ఒక ఆపిల్ పండు తింటే వైద్యుడి అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆపిల్ పండు ఎన్నో రోగాల నుంచి మనల్ని ఈజీగా రక్షిస్తుంది. కానీ వీటిని రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదట. రాత్రి సమయంలో యాపిల్ పండ్లను తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. రాత్రి సమయంలో ఆపిల్ పండ్లను తింటే జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతింటుంది. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. రాత్రిపూట సపోటాలను ఎట్టి పరిస్థితిలో కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని రాత్రిపూట తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉందట. అందుకే పడుకునే ముంది అరటి, అపిల్‌ ఇంకా సపోట పండ్లు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: