సాధారణంగా పూర్వం మట్టి పాత్రలు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అనేక రకాల ఐటెమ్స్ వచ్చేసాయి. వంట చేసేటప్పుడు గృహిణులు తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే, యాసిడ్స్ కలిగిన పదార్థాలు, అంటే టమాటాలు, అలాగే పుల్లని పదార్థాలు కోసం అల్యుమినియం పాత్రలను వాడినపుడు వీటినుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుంది.
పరిశోధనల ప్రకారం తెలిసింది ఏంటంటే.. ఒకవేళ మనం ఇంట్లో అల్యూమినియం వస్తువులను వాడాల్సి వచ్చినపుడు కూడా వాటిలో ఎక్కువ సమయం పులుపు, యాసిడ్ కలిగిన పదార్థాలు నిల్వ ఉంచకుండాను, ఎక్కువ సమయం వేడి చేయకుండా వాడుకోవాలి. అయితే కూరలు క్రోమియమ్, లెడ్, కాడ్మియమ్, నికిల్ వంటి మిగిలిన వస్తువులలో కంటె అల్యూమినియంలో ఉడికించేటప్పుడు మూడింతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల, బ్రెయిన్లోని క్రోమాటిక్ నెట్ వర్క్ పైన ప్రభావం పడి , బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనల్లో రుజువైంది. అల్యూమినియం చేసే హాని నుంచి బయటపడాలంటే ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలి. ఈ ఎనొడైజ్డ్ మెటల్తో తయారు చేసిన పాత్రలు, పాన్లు కూడా త్వరగా వేడెక్కడమే కాక, మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది.
దానితో పాటు గీతలు పడకుండా,శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలలో పదార్థాలు వండటం వల్ల అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే బాగా బాయిల్ చేసి వండే ఏ వంటకాన్నైనా అల్యూమినియం పాత్రల్ని వాడకపోవటమే మంచిదంటున్నారు.