గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్‌1వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య‌మైన సంఘటనలు

అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.
1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు).
1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.
1983: ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.


ప్ర‌ముఖుల జననాలు

1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980)
1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)
1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986)
1944 తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, నటి,
1974: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.
1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.

ప్రముఖుల మరణాలు


1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.
1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)
పండుగలు , జాతీయ దినాలు
ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.
కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం.

మరింత సమాచారం తెలుసుకోండి: