గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 22వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి.
1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది.
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.
1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.
1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.

ప్ర‌ముఖుల జననాలు


1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో ఈమె సైనికురాలు. 
1864: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955)
1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)
1913: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988)
1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)
1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.
1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.


ప్ర‌ముఖుల మరణాలు

1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)
2006: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)
2016: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (జ.1930)

మరింత సమాచారం తెలుసుకోండి: