గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 6వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

ప్ర‌ముఖుల జననాలు

1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)
1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966). నాటకరంగం, సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు. తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు.
1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
1933: కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.

ప్ర‌ముఖుల మరణాలు

1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.
1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణతో గౌరవిస్తే, కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ (1958), పద్మభూషణ్ (1962) పురస్కారాల్ని ఇచ్చి గౌరవించింది. వీరి సేవలను పురస్కరించుకుని హైదరాబాదులో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 1957 పెద్ద ఎత్తున అభినందన సభ జరిపి అభినందన గ్రంథం సమర్పించారు.
2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)
2019: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932)

మరింత సమాచారం తెలుసుకోండి: