ఇక చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి చరిత్రలో జరిగిన ప్రతి రోజు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇక చరిత్రలో ఈరోజు ఏం జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే..ఇక 1957 వ సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటవ్వడం జరిగింది.1976 వ సంవత్సరంలో వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పడం జరిగింది.2015 వ సంవత్సరంలో ముంబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీయడం జరిగింది.ఇక 1883 వ సంవత్సరంలో ముస్సోలినీ జన్మించాడు. ఇతను ఇటలీకి చెందిన ఒక గొప్ప రాజకీయ నాయకుడు.ఇక 1904 వ సంవత్సరంలో జె.ఆర్‌.డి.టాటా జన్మించాడు.ఈయన గొప్ప పారిశ్రామికవేత్త అలాగే తొలి విమాన చోదకుడు.1931వ సంవత్సరంలో సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించాడు. ఈయనో గేయరచయిత ఇంకా సాహితీవేత్త అలాగే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.1975 వ సంవత్సరంలో కృష్ణుడు (నటుడు)జన్మించాడు.ఇతడు తెలుగు సినీ నటుడు.ఇక 1975 వ సంవత్సరంలో లంక డిసిల్వా జన్మించాడు. ఇతను శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.

ఇక 1890 వ సంవత్సరంలో విన్సెంట్ వాన్ గోహ్ మరణించారు.ఈయన డచ్ చిత్రకారుడు.1891వ సంవత్సరంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ మరణించారు. ఈయన బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త ఇంకా రచయిత అలాగే అనువాదకుడు ఇంకా సమాజ సేవకుడు.ఇక 1931 వ సంవత్సరంలో బిడారం కృష్ణప్ప మరణించారు.ఈయన తాళబ్రహ్మ ఇంకా గాన విశారద.1996 వ సంవత్సరంలో అరుణా అసఫ్ ఆలీ మరణించారు.ఈమె భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.ఇక 2012 వ సంవత్సరంలో వెంపటి చినసత్యం మరణించారు.ఈయన కూచిపూడి నాట్యాచార్యుడు.ఇక 2019 వ సంవత్సరంలో కె.బి.లక్ష్మి తెలుగు రచయిత్రి మరణించారు. ఈమె పాత్రికేయురాలు.అలాగే ఇదే సంవత్సరంలో ముఖేష్ గౌడ్ మరణించారు.ఇక ఈయన హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇంకా మాజీమంత్రి.కాబట్టి చరిత్రలో జరిగిన విషయాలు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: