ఆధునిక కాలంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు నేనున్నా అంటూ ముందుకు వస్తున్న సమంత, అందులో భాగంగా ఆదివారం జరిగే ఒన్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరించి ముందుకు వచ్చింది. ఈ ఛాలెంజ్ ప్రకారం ఆదివారం జులై 21 న మన సమంత కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించబోతున్నారు.


"తనతో పాటుగా ఈ వన్ బకెట్ ఛాలెంజ్ కి ఎవరు స్వీకరిస్తారు.? ఎవరూ తనతో అండగా ఉంటారనీ.." సమంతా ట్విటర్ లో ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్ ను ఎవరు కూడా మోసం చేయకుండా నిజాయితీగా చేయాలని ఆమె కోరారు. అలాగే ఆ రోజు మొత్తం మీద కేవలం ఒక్క బకెట్ వాటర్ ని మాత్రమే ఉపయోగించాలని చెప్పారు.
ఛాలెంజ్ ను స్వీకరించిన సమంతా వాటికి సంబంధించిన ఫొటోస్ ను కూడా పోస్ట్ చేస్తానని చెప్తూ, ఈ ఛాలెంజ్ ను ఎవరైతే స్వీకరిస్తారో వారు కూడా వాళ్ల ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ మిగతా వాళ్ళకు స్పూర్తిదాయకంగా ఉండాలని ఆమె అనుకుంటున్నారు.ఒక నీటి చుక్క కూడా ఎంతో విలువైనదని సమంతా చెప్తూ,తను చేసిన ఛాలెంజ్ పై సినీ ప్రముఖులు కొంత మంది స్పందించి ట్వీట్ చేశారని చెప్పారు.


మొదటిగా స్పందించిన వారిలో వరుణ్ తేజ్, నాగ అశ్విన్‌ ,బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నారు. చివరికి ఒక అర్థవంతమైన ఛాలెంజ్‌ మొదలైందని, ఈ ఛాలెంజ్‌ను అందరూ తప్పక పాటిస్తే మనకు నీటి కొరత తగ్గుతుందని చెబుతూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: