రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవడం చాలా మంచిది. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలకూర , ఆకు కూరలు వంటివి తినడం వల్ల క్యాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వీటి వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వారానికి మూడు సార్లు పచ్చి పండ్లు , పాల కూర , పచ్చి కూరగాయలు వంటివి తీసుకోవడం తప్పనిసరి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలి అంటే కొబ్బరి నూనెను వంటలో ఉపయోగించాలి. కడుపు సంబంధిత సమస్యలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వయసు పెరిగేకొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది . కాబట్టి కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అనవసరమైన కొవ్వును తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కాపాడుతుంది.
ఫైబర్ అధికంగా లభించే క్వినోవా, తృణధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ టీ లాంటివి ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.