అయితే వివరాలు సరిగా ఉంటే కానీ పనులు కావు.
అలాంటప్పుడు ఇక ఆధార్ కార్డ్ లో వివరాలు సరి చేసుకోవడానికి జనాలు వాటిని పట్టుకుని ఆధార్ సెంటర్లకు , తహసిల్దార్ ఆఫీసర్ వంటి వారి దగ్గరకు పరుగులు తీస్తుంటారు. అయినా అందరికీ పనులు జరగవు. ఇలా ఆధార్ కార్డ్ కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాగా ఇలాంటి వారి కోసం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకు రానున్నది ప్రభుత్వం. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్ను మొబైల్ నంబర్లతో లింక్ చేయడం, వారి వివరాలను అప్డేట్ చేయడం, అలాగే ఈ తరహా వాటిని అప్డేట్ చేయడం వంటి పనులను ఇక నుంచి పోస్ట్మ్యాన్లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందు కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కు చెందిన 48,000 మంది పోస్ట్మెన్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఇప్పటికే శిక్షణనిస్తోంది.
అంతే కాకుండా వారికి తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి అవసరం అయినా కార్డ్ హోల్డర్, ల్యాప్ ట్యాప్, డెస్క్ ట్యాప్ వంటి అవసరమైన వాటిని పోస్ట్మెన్లకి ఇచ్చేందుకు సర్వం సిద్దం చేస్తోంది సర్కారు. పోస్టుమెన్లతో పాటు ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కామన్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న దాదాపు 13,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఇందు కోసం అదనంగా వినియోగించనున్నట్లు చెబుతున్నారు. తద్వారా అందరికీ అందుబాటులో సర్వీసులు ఉంటాయని త్వరగా పనులు పూర్తి అవుతాయని చెబుతున్నారు.