సాధారణంగా ప్రతి ఒక్కరూ మాకు అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఈ విషయం ఎలా మిస్ అయ్యామబ్బా అని అనుకుంటూ ఉంటారు. ప్రపంచం దాకా ఎందుకు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి కూడా  అప్పుడప్పుడు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇలాంటివి తెలిసినప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ లో మునిగిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఉన్న ప్రముఖ ప్రాంతాల గురించి చెప్పమంటే ఎంతో సులభంగా చెప్పేస్తూ ఉంటారు.



 కానీ తెలంగాణ లో ఒక వింత గ్రామం ఉందని.. ఆ గ్రామం లో సాయంకాలం వాతావరనాన్ని ఇప్పటివరకు గ్రామస్తులు అనుభూతి చెందలేదని ఎవరికి తెలియదు. దీనికంతటికీ కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులేనట. అయితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్ కారణంగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు ఈటీవీలో వావ్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు సాయి కుమార్.


 ఈ కార్యక్రమం లో భాగంగా అప్పుడప్పుడు ఎంతో ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే  ఇటీవలే వావ్ షోలో భౌగోళిక  పరిస్థితి కారణంగా సాయం కాలం వాతావరణాన్ని అనుభూతి చెందని గ్రామం ఏది అంటూ ప్రశ్నించాడు.. దీనికి ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు అని చెప్పాలి. దీంతో ఆ గ్రామం ఏదో కాదు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని కోదురుపాక గ్రామం అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ 4 గంటలు అవుతుంటే  నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతుందట. అయితే కుదురుపాక గ్రామానికి చుట్టూ నాలుగు వైపులా గుట్టలు ఉండడంతో ఇక్కడి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల పై ప్రభావం చూపిస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: