ఒక్కో కూరగాయల ధరలు కేజీ వందల్లో కనపడుతూ ప్రజల్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయ పంట పొలాలు నీట మునిగి నష్టాలు రావడం తో కూరగాయల ధరలపై వాటి ప్రభావం పడింది. టమాటాలు అయితే బంగారం ధరల కన్నా ఎక్కువగా ఉండి భయపెడుతున్నాయి. కేజీ 10 రూపాయలు అనే టమాటాలు కాస్త వారం, పది రోజుల గ్యాప్ లోనే 50 రూపాయల మార్క్ ను దాటాయి.
ఇక మిగిలిన కూరగాయలు కూడా ఇదే బాటలో పరుగులు తీస్తున్నాయి. ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని కంతటికీ కారణం వరుణ దేవుడే అని చెప్పాలి. అవసరం అయినప్పుడు వర్షాలు పడకుండా ఇప్పుడు పాడడం వలన అంతా నష్టాలే కలుగుతున్నాయి. అయితే ఈ ధరల ప్రభావం నుండి బయటపడలాంటే మనము ఖచ్చితంగా రోజు వారీ ఖర్చులను తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి.