ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం సరదాగా ఉండడమే కాకుండా జీవితంలో సరికొత్త విషయాలను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి ఇలాంటి ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉండవు బస్సులలో, రైలలో, కార్లలో ఎక్కడైనా ఇతర వాహనాల ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఏరోప్లేన్ లో ప్రయాణించేటప్పుడు సీటు ముందర ఒక బ్యాగు లాంటిది ఉంటుంది అయితే ఏదైనా బస్సులో ,కారులో ఇతర వాహనాల ప్రయాణించేటప్పుడు మాత్రం ఇలాంటివి ఉండవు. అందుచేతనే మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిటిని దగ్గర పెట్టుకుంటే చాలు వాటి గురించి చూద్దాం.


1). ప్రయాణం చేసేటప్పుడు మనం కచ్చితంగా అరటిపండును మన దగ్గర పెట్టుకుంటే అందులో పొటాషియం ఉంటుంది కనుక వాంతిని చాలా దూరం చేస్తుంది. అందుచేతనే ప్రయాణం చేసేటప్పుడు అరటి పండు తినడం చాలా మంచిది.

2). నిమ్మకాయలలో ఎన్నో లక్షణాలు ఔషధ గుణాలు కూడా కలిగే ఉంటాయి. వీటన్నిటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీంతో పలు అనారోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. నిమ్మకాయలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ప్రయాణాలలో వాంతులు వికారం వాటి సమస్యలు ఎదురైనప్పుడు నిమ్మకాయ రసాన్ని లేదా వాసనని చూసినట్లు అయితే వాంతులు వికారం వెంటనే తగ్గిపోతాయి.


3). మన వంటింట్లో దొరికేటువంటి వాటిలో అల్లం కూడా ఒకటి. మనం ప్రయాణం చేస్తున్న సమయాలలో వాంతులు ఎక్కువగా వస్తున్నట్లు అయితే అల్లం చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణం చేసేటప్పుడు అల్లాని కొంచెం నోట్లో వేసుకున్నట్లయితే తక్షణ ఉపశమనం కలుగుతుందట. లేదంటే ఏదైనా అల్లంతో చేసిన వాటిని తిన్నా కూడా సరిపోతుంది. ఇక ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: