ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం అనేది మన ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.ఈ రోజుల్లో మార్పుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. రకరకాల జబ్బులు వెంటాడుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. జీవన విధానంలో మార్పుల కారణంగా ఈ పరిస్థితి వస్తోంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగు పర్చడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.మన తరచూ తినే పప్పుల్లో కూడా విటమిన్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పు దినుసుల్లో ఫైబర్‌, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి కావడంలో సహాయపడతాయి.


పప్పు దినుసుల్లో విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌ కూడా లభిస్తాయి.మన పెద్దవాళ్లు ఒకప్పుడు రాగి, జొన్నలు, సజ్జలు ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, పంటలు పండిస్తున్న విధానం వల్ల ఆనారోగ్యానికి గురవుతుంటారు. ఈ మిల్లెట్లలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం.మన వంటింట్లో మసాల దినుసులు ఉండటం తప్పనిసరి. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ రకాల నొప్పుల నివారణ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గాయాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంతో ఎంతో ఉపయోగపడతాయి.కాబట్టి ఖచ్చితంగా ఇవి తినండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: