ఇక ఈ ఆచారం రావడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడైతే ప్రతి గదికి ఒక బాత్ రూమ్, బాత్ టబ్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం స్నానాలకు ప్రత్యేకమైన గదులు ఉండేవి కాదు. దీంతో అప్పట్లో దగ్గరలో ఉన్న చెరువులు నదులు జలాశయాల దగ్గరికి వెళ్లి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అక్కడే స్నానాలు చేసేవారు. ఈ క్రమంలోనే ఒంటి నిండా బట్టలు వేసుకుని స్నానం చేయడం చేసే వారు. ఇక చిన్న పిల్లలకు సైతం ఒంటిపై ఏదో ఒకటి కప్పి స్నానం చేయించేవారు. అది కూడా సూర్యోదయం కు ముందే ముగించుకోవాలి.
ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది అని ఎంతో మంది భావించేవారు. నీటిని దైవంగా భావిస్తారు భారతీయులు. అందుకే గంగా యమునా గంగోత్రి గోదావరి అని స్త్రీలా పేర్లు ఉంటాయి. నీటి ఎదుట నగ్నంగా నిలబడితే దేవతలు ఆగ్రహిస్తారు అని. అశుభం అని పూర్వీకులు కూడా నమ్మే వారట. ఆ కారణంతో కూడా నగ్నంగా స్నానానికి దూరంగా ఉండేవారట. ఇప్పుడు మాత్రం ఆధునికయుగంలో గదికొక బాత్రూం రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా నే స్నానాలకు వెళ్తూ ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ కట్టుబాట్లు నియమాలు అన్నీ మారిపోయాయి అని చెప్పాలి. అంతేకాదండోయ్ కొన్నిచోట్ల అయితే ఆడా మగా కలిసి స్నానం చేస్తూ ఉండడం కూడా జరుగుతుంది.