ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి విధానం, అధిక టెన్షన్‌, ఒత్తిడి, నిద్రలేమి ఇంకా అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల వివిధ వ్యాధులు వెంటాడుతున్నాయి. ముందే రకరకాల వైరస్లు వెంటాడుతున్నాయి. కరోనా కాలం నుంచి కొత్త కొత్త వైరస్లు వస్తుండటంతో జనాలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో కల్తీ ఉంటుంది. రోడ్డుపై ఉండే ఫాస్ట్ ఫుడ్ గానీ, ఇతర పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. తాజాగా ఉన్న ఆకు కూరలు, అప్పుడే వండిన పదార్థాలను తీసుకోవడం మంచిది. ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు పండ్లను తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.గొంతులో ఆహారాన్ని మింగడానికి ఇబ్బంది పడటం సాధారణంగా సమస్యగా భావించి చాలా మంది విస్మరిస్తుంటారు. ఆహారం మింగడంలో ఇబ్బంది లాంటి గొంతులో సమస్య ఉంటే అది థైరాయిడ్ క్యాన్సర్‌కు సంకేతం. థైరాయిడ్ క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాణాంతకం అని కూడా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఈ క్యాన్సర్‌పై సకాలంలో చికిత్స తీసుకుంటే, ప్రాణాంతకమైన ప్రమాదాలను నివారించవచ్చు.థైరాయిడ్ క్యాన్సర్ గొంతులో వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్‌కు మ్యుటేషన్ కారణం. కణాలు చనిపోయి అవి కణితిని ఏర్పరుస్తాయి. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా, మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా, ఫోలిక్యులర్ కార్సినోమా, అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా. లేకపోతే ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ప్రారంభం అవుతుంది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. లేకపోతే ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి క్యాన్సర్ వ్యాపించినట్లయితే దానిని నయం చేసుకోవాలంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా లకణాలు కలిగి ఉండి, గొంతులో నొప్పిగా ఉండి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. దీని వల్ల మీరు పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: